Site icon vidhaatha

మునుగోడు ఉపఎన్నికలో కుట్ర జరుగుతోంది: మంత్రి హరీశ్‌ రావు

విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్‌కు భయపడే మునుగోడు ఉపఎన్నికలో కుట్ర జరుగుతుందని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. హాయత్ నగర్ లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఎల్ఐసీ ఏజెంట్స్ ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని హరీష్‌రావు మండిపడ్డారు.

ప్రజల కోసం కాదు.. కాంట్రాక్టుల కోసం వచ్చిన ఎన్నిక ఇది అని, మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో 3000 వేలు, ఎడ్లు, బండ్లు ఇస్తాం అన్నారు. గెలిచాక దిక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

8 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎయిర్ పోర్టు, రైళ్లు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు. దేశానికి బీమా సంస్కృతి నేర్పిన ఎల్ఐసీని అమ్మకానికి పెడుతున్నారు. Bsnl లో 75 వేల ఉద్యోగాలు తీసేశారు. రేపు ఎల్ఐసీ పరిస్థితి అంతే. ఆకలి రాజ్యంగా దేశాన్ని మార్చారు.

ఆకలిసూచిలో దేశం 107వ స్థానంలో ఉందన్నారు. తనకు ఎల్‌ఐసీ విషయంలో సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఎల్ఐసీ ఏజెంట్లు మునుగోడు ఎన్నిక ఎందుకోసం ఎవరి కోసం వచ్చిందో ఒకసారి ఆలోచించాలన్నారు.

ప్రజలకు సేవచేయకుండా సొంత లాభం కోసం రాజీనామా చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎవరిని తృప్తి పరిచేందుకు, బలవంతపు ఎన్నికలు ఎందుకన్నారు. నాలుగేళ్ల కింద ఓటు వేస్తే ఒక్కసారి మా ఊరికి రాలేదు, సమస్యలు పరిష్కరించలేదని రాజగోపాల్ రెడ్డి గురించి ప్రజలు అంటున్నారన్నారు. శివన్నగూడెం ప్రచారంలో ఎకరాకు 10 లక్షలు, ఇల్లు కట్టిస్తా అన్నారని, అది ఏమైందో చెప్పాలన్నారు.

మునుగోడు ప్రజల కోసం 70 ఏళ్ల ఫ్లోరైడ్ బూతాన్ని మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చి తరిమికొట్టాం. రూ.2016 పింఛన్లు ఇస్తున్నాం. నేత, గీత, వృద్ధులు, వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు, ఇలా 45 లక్షల మందికి పింఛన్లు, పది కిలోల బియ్యం ఇస్తున్నాం. దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ.

కేంద్రం బాయిల కాడ మీటర్లు పెట్టాలి అంటున్నది. ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి చెబుతున్నా.. విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడితే 6000 కోట్లు ఇస్తామన్నారు. సంతకం పెట్టండి అన్నారు. రైతు మెడకు ఉరితాడు అవుతుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఐదేళ్లలో రూ.30 వేల కోట్లు వదులుకుమని మంత్రి తెలిపారు.

ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు పెట్టీ మోటార్లకు మీటర్లు పెడుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం తెలంగాణ అలా చేయలేదన్నారు. గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఉండేదని, సబ్సిడీ క్రమంలోగా తెలిగించారని ఆరోపించారు. మునుగోడులో ఆత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. బీజేపీ గెలిస్తే ప్రజలు మీటర్లు పెట్టేందుకు అంగీకరించారని అని మోటార్లకు మీటర్లు పెడతారన్నారు.

రైతు బంధు, రైతు బీమా, తాగు నీరు, కళ్యాణ లక్ష్మి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీ ఇలా అనేక పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీజేపీ నేతలు బూతులు మాట్లాడటం తప్ప ఒకటన్నా పనిచేశామని చెప్పరన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్, బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అన్నారని, ఆ హామీ ఏమైందని మంత్రి ప్రశ్నించారు.

Exit mobile version