Site icon vidhaatha

మునుగోడులో జెట్ స్పీడ్‌తో అభివృద్ధి: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: కులం పేరుతో మతం పేరుతో మంటలు పెట్టె బీజేపీకి మునుగోడులో డిపాజిట్లు దక్కకుండా బుద్ది చెప్పాలని ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలిసి నాంపల్లి మండలం ఎస్ లొంగోటo గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గ్రామస్తులు బోనాలతో, బతుకమ్మలతో, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని గెలిపించుకుంటే మునుగోడులో జెట్ స్పీడ్ తో అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు. టీఆర్‌ఎస్ గెలుపుతో మునుగోడు దశ తిరుగుతుందని, అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version