Site icon vidhaatha

Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం.. హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..!

Gold Rates |

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.150 పెరిగి.. తులానికి రూ.55,150కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.150 పెరిగి.. తులానికి రూ.60,160కి ఎగిసింది.

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,310 వద్ద కొనసాగుతున్నది.

ముంబయి, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,160 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,490కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,160 పలుకుతున్నది

. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు నిన్నా మొన్నటి వరకు భారీగా పెరిగిన వెండి ధరలు ఇవాళ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నది. కిలో వెండి రూ.77,600 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,700 వద్ద కొనసాగుతున్నది.

Exit mobile version