Gold Rates | దేశంలో వరుసగా రెండో రోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరో నిన్న భారీగా పెరిగిన వెండి స్వల్పంగా తగ్గింది.
ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.54,650 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,620 వద్ద కొనసాగుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,760గా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,620 వద్ద ట్రేడవుతున్నది.
చెన్నైలో 22క్యారెట్ల బంగారం రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,950 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,620 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా మార్కెట్లో వెండి ధరలు మంగళవారం స్వల్పం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండిపై రూ.200 ఉండగా.. కిలోకు రూ.72,800గా కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి రూ.76వేలు పలుకుతున్నది.