పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని శారదా పీఠం.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా!

‘నమస్తే శారదాదేవి కాశ్మీరపుర వాసిని త్వం హమ్ ప్రార్థేయే నిత్యం విద్యాదానం చే దేహీ మాహీ’ కాశ్మీరులోని ఆ సరస్వతీ దేవి కొలువు ఎక్కడుంది? ఎలాంటి స్థితిలో ఉంది? అని తెలుసుకోవాలని ఉంది కాదా. మేము చేసిన అధ్యయనంలో బాధాకర విషయాలు తెలిశాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు అది పండితులను తీర్చి దిద్దే విద్యాకేంద్రంగా వైభవం చాటింది. ఎంతటి పాండిత్యం ఆ పరిసర గాలుల్లో ఉందంటే అక్కడ కొలువై ఉన్న అమ్మవారి పేరుతో ఒక […]

  • Publish Date - December 11, 2022 / 07:06 AM IST

‘నమస్తే శారదాదేవి కాశ్మీరపుర వాసిని త్వం హమ్ ప్రార్థేయే నిత్యం విద్యాదానం చే దేహీ మాహీ’ కాశ్మీరులోని ఆ సరస్వతీ దేవి కొలువు ఎక్కడుంది? ఎలాంటి స్థితిలో ఉంది? అని తెలుసుకోవాలని ఉంది కాదా. మేము చేసిన అధ్యయనంలో బాధాకర విషయాలు తెలిశాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు అది పండితులను తీర్చి దిద్దే విద్యాకేంద్రంగా వైభవం చాటింది. ఎంతటి పాండిత్యం ఆ పరిసర గాలుల్లో ఉందంటే అక్కడ కొలువై ఉన్న అమ్మవారి పేరుతో ఒక భాషా లిపి చలామణిలో ఉండేదట. ప్రపంచ పండితుల వేదికగా, హిందూ, భౌద్ధ ధర్మాల నిలయంగా ఉండేది. -విధాత

స్థల పురాణం

కాశ్మీరేతు సరస్వతి అని దేవీ అష్టాదశ శక్తి పీఠ స్త్రోత్రంలో చదువుతాం. దక్షయజ్ఞం తర్వాత సతీ దేవి శరీర భాగాలు భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో పడ్డాయని అవే శక్తి పీఠాలుగా వెలిశాయని పురాణాలు చెబుతున్నాయి. అమ్మ వారి భాగాలలో కుడి చేయి కాశ్మీరంలో పడిందనీ ఫలితంగా అక్కడ అమ్మవారు శారదా దేవిగా వెలసిందని చెబుతారు. ఇదే అష్టాదశ శక్తి పీఠాలలో చివరిదైన శ్రీ సరస్వతీ శక్తి పీఠం. శాండిల్య మహర్షి ఈ దేవాలయం పక్కనే ఉన్న శారదా వనంలో తపస్సు చేయగా ఆ శారదామాత ప్రత్యక్షమై ఆపార జ్ఞానాన్ని ఇచ్చిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఆది శంకారాచార్యులు కూడా ఇక్కడ జరిగిన పండిత సభలోనే తన జ్ఞానాన్ని నిరూపించుకున్నారని చెబుతున్నారు.

ఎక్కుడుంది?

కాశ్మీరులోని బారాముల్లా జిల్లాలో నీలం లోయా పరివాహక ప్రాంతంలో ఈ శక్తి పీఠం ఉంది. శారద, నారధీ అనే రెండు పర్వతాల మధ్య నీలం నది ప్రవహిస్తుంటుంది. ఈ నది ఒడ్డునే ఉన్న శారద అనే గ్రామంలో అమ్మ వారు శారదాదేవిగా కొలువై ఉంది. నీలం నదిని కిషన్ గంగా అని కూడా అంటారు. నిజానికి ఇదో కుగ్రామం కానీ అమ్మవారు కొలువై ఉండడం వల్ల ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. స్థానికులు ఈ అమ్మవారిని గీర్ భవానిగా కొలుకుచుంటారు. ఈ పీఠాన్ని సర్వజ్ఞ ఫీఠం అంటారు. వాదంలో అన్ని మతాల వారిని ఓడించి ఆది శంకరాచార్యులు ఈ పీఠాన్ని అధిరోహించారట. కేవలం పండితులు మాత్రమే కాదు రచయితలు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చేవారని చరిత్ర చెబుతోంది.

అమ్మవారి విగ్రహం ముందు తమ గ్రంథాలను ఉంచి రాత్రి వేళ తలుపులు మూసి వెళ్లి పోయే వారట. ఉదయం విగ్రహం ముందున్న తాళపత్ర గ్రంథాలు కదలకపోతే వాటికి అమ్మవారి ఆశీర్వాదం దొరికినట్టుగా నమ్మేవారట. ఒక వేళ తాళపత్రాలు చెల్లా చెదురుగా ఉంటే అమ్మవారికి అవి తృప్తికరంగా లేవని భావించే వారట. ఇంత ప్రాశస్త్యం కలిగిన అమ్మవారు కొలువై ఉన్నందున కాశ్మీర్‌ను శారదాదేశం అని పిలిచే వారని ప్రతీతి. ఇక్కడి మరో విశేషం ఏమంటే ఇక్కడి స్థానికి ప్రజలు వాడే లిపిని శారద లిపి అని అమ్మవారి పేరుతోనే పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి దర్శనానికి వేలకొద్ది యాత్రికులు దేశవిదేశాల నుంచి వచ్చే వారని చరిత్ర చెబుతోంది. చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్ కూడా తన పుస్తకంలో ఈ పీఠం గురించి ప్రస్తావించాడు. అల్బరేని అనే మరో విదేశీయుడు ఈ శారదా ఫీఠాన్ని సందర్శించి ఈ దేవి వైభవాన్ని వర్ణించాడు.

అక్బర్ చక్రవర్తి ఆస్థాన పండితుడు అబుఫజల్ తన రాతల్లో ఈ దేవలయాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఈ బంగారు వెలుగులతో శోభాయమానంగా ఉంటుందని, ప్రతి శుక్ల పక్ష అష్టమి నాడు ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పుకొచ్చాడు. అమ్మవారి చెంత వేద అధ్యయనం కోసం ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉండేదట. ఇక్కడ సంస్కృతం నేర్చుకునేందుకు ఎంతోమంది వచ్చే వారట. మనదేశంలోని అతి పురాతన విశ్వవిద్యాలయాల్లో ఇది కూడా ఒకటి. దాదాపుగా 5 వేల మంది విద్యార్థులు అన్ని ఆసియా దేశాల నుంచి ఇక్కడ చదుకునే వారట. అతి పెద్ద లైబ్రరీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేది. అయితే 12వ సెంచరీ వరకు పెద్ద అధ్యయన కేంద్రంగా విలసిల్లింది.

అంతా గత వైభవమే

కాశ్మీర్‌లోని ఈ శక్తి పీఠం ఎన్నో దాడులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదర్కొన్నది. ఫలితంగా ఆలయం క్రమంగా శిథిలం అయిపోయింది. ఇలా జరుగుతున్న తరుణంలో ఆధిశంకరులు ఈ అమ్మవారి శక్తిని ఒక బంగారు శారదా దేవి విగ్రహంలో నిక్షిప్తం చేసి దాన్ని శృంగేరీ తరలించారనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. 14 వ శతాబ్ధంలో మొదటి సారి విదేశీ దాడులకు గురై శిథిలం అయ్యింది. ఆ తర్వాత 19 శతాబ్ధంలో కాశ్మీర్ మహారాజు గులాబ్ సింగ్ చివరి సారిగా మరమ్మత్తులు చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. తరువాత జరిగిన వరుస దాడుల్లో ఆలయం పూర్తిగా శిథిలం అయిపోయింది.

ప్రస్తుతం ఈ ఆలయం పాకి ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంది. 2005లో భూకంపం దాటికి మరింత శిథిలం అయ్యింది. అమ్మ వారి విగ్రహం ఎప్పుడు అదృశ్యమైందనేది తెలినే తెలీదు. అయితే ప్రస్తుతం ఇక్కడ శివలింగం మాదిరి ఓ ఆరు ఆడుగుల రాయి మాత్రమే ఇక్కడ దర్శనమిస్తుంది. కాగా మన దేశ హిందువులు చూడడానికి కాశ్మీర్‌ ప్రభుత్వం పర్మీషన్‌ ఇస్తోంది. 1947-48 పాకీస్తాన్ ఇండియా యుధ్ధానంతరం ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా మారిపోయింది. అప్పటి నుంచి దీని ఆలనా పాలనా పెద్దగా పట్టించుకునే వారు లేరనే చెప్పాలి.

ఎలా వెళ్లొచ్చు?

పీఓకేలోని మౌంట్ హర్ముఖ్ లోయలో ఉన్న ఈ ఆలయం సముద్ర మట్టానికి 1981 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్ నుంచి 150 కీలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఉరి- ముజఫరాబాద్ మీదుగా ఒకటి , పూంచ్ – రావల్ కోట్ మీదుగా మరోటి. ఉరి – ముజఫరాబాద్ దారి ఎక్కువ మంది ఉపయోగించే మార్గం. ఉరి నుంచి 70 కి.మీ దూరం ఉంటుంది.