Site icon vidhaatha

మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా: సీఎం కేసీఆర్

విధాత‌: ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

చండూరు మండ‌లం బంగారిగడ్డ‌లో నిర్వ‌హించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ మునుగోడు ఉప ఎన్నిక అవ‌స‌రం లేకుండానే వ‌చ్చింది. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం ఎప్పుడో తేల్చేశారు అది కూడా తెలుసు. నేను కొత్త‌గా చెప్ప‌డానికి ఏం లేదు. మీకు అన్ని విష‌యాలు తెలుసు.

ఒక నాలుగు విష‌యాలు చెప్పాల‌ని ఇక్క‌డికి వ‌చ్చాను. ఎల‌క్ష‌న్లు వ‌స్తాయి.. ఎన్నిక‌లు రాగానే ఏందో ఏమో మాయ‌రోగం ప‌ట్టుకుంటుంది. గ‌త్త‌ర గ‌త్త‌ర లొల్లి లొల్లి ఉంట‌ది. కొంద‌రైతే గ‌జం ఎత్తున గాల్లోనే న‌డుస్తున్నారు. విచిత్ర వేషాధారులు, అనేక పార్టీలు వ‌స్తాయి. ప్ర‌జ‌ల‌కు మ‌న‌కెందుకు ఉండాలి. నేను చెప్పిన మాట‌లు జాగ్ర‌త్త‌గా వినండి. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను. ఈ మాట‌ల‌ను ఇక్క‌డ‌నే వ‌దిలేసి వెళ్లిపోవ‌ద్దు. మీ ఊరెళ్లిన త‌ర్వాత చ‌ర్చ చేసి నిజ‌నిజాలు తేల్చాలి. ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే.. ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది.

చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్త‌ది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్ర‌మాదం వ‌స్త‌ది. దేశంలో ఉన్న‌ది ప్ర‌జాస్వామ్యం.

మీరు టీవీల్లో చూసింది గింతే.. మున్మందు ఢిల్లీ పీఠ‌మే దుమ్ము రేగిపోద్ది: CM KCR

ఈ దేశంలో ఏం జ‌రుగుతుందో మ‌న‌సు విప్పి ఆలోచించాలి. ఓటు వేసేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి. క‌రిచే పాము అని చెప్పి మెడ‌లో వేసుకుంటామా? ఆలోచించాలి. దేశంలో చైత‌న్యం రానంత వ‌ర‌కు దుర్మార్గ రాజ‌కీయాలు కొన‌సాగుతాయి. దోపిడీదారులు మాయ‌మాట‌లు చెప్పి మోసం చేస్తారని కేసీఆర్ సూచించారు. ఇవాళ నాతో పాటు న‌లుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి మునుగోడుకు వచ్చారు. మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నిన ఢిల్లీ బ్రోకర్ల కోట్ల రూపాయలను తిరస్కరించిన నా నలుగురు ఎమ్మెల్యేలు వీరే అని కొనియాడారు.

మునుగోడు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చైతన్యాన్ని ప్రదర్శించాలని సీఎం కేసీఆర్ కోరాడు. రైతులకు ఉచిత విద్యుత్ వద్దంటున్న మోడీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కార్పోరేట్ శక్తులకు వివిధ రకాల పేర్లతో అందిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మోటార్ల కు మీటర్లు పెడుతామంటున్న వారికి మునుగోడు ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.

చండూరు మండలం బంగారుగడ్డలో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడులో చేనేత కార్మికులు ఉన్నారు. దేశంలో ఏప్ర‌ధాని కూడా చేయ‌ని దుర్మార్గం మోదీ చేసిండు. ఇబ్బందుల్లో ఉన్న చేనేత‌పై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారు. ఏ విధంగా చేనేత బిడ్డ‌లు బీజేపీకి ఓటు వేయాలి. ఆలోచించాలని అన్నారు.

జ‌గ‌దీశ్ లేకుండా.. 20 ఏండ్ల‌లో ఏ స‌భ‌లో మాట్లాడ‌లే.. బాధ‌తో వ‌చ్చా: సీఎం కేసీఆర్

నాకే ఓటు వేయ్ అని అడ‌గ‌డం ధ‌ర్మ‌మేనా? ఇవాళ వామ‌ప‌క్షాలు, టీఆర్ఎస్ క‌లిసి ప్ర‌జాస్వామ్యాన్ని నిల‌బెట్టేందుకు పోరాటం చేస్తున్నాయి. ప్ర‌జాస్వామ్యంలో ఓటు అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. ఆ ఓటు బ‌లంతోనే పోటు పొడుస్తాన‌ని చెప్పిన త‌ర్వాత కూడా బీజేపీకే ఓటు వేయాల్నా? ఆలోచించాలి. పోస్టుకార్డు ఉద్య‌మంపై నిర్ణ‌యం తీసుకోవాలంటే చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయొద్దు.

నీ చేతిలో ఉన్న ఓటును బాగు, భ‌విష్య‌త్‌, దేశం కోసం వినియోగించ‌మ‌ని చెబుతున్నాను. దేశంలో 4 ల‌క్షల మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం ఉంది. కానీ ఈ దేశం 2 ల‌క్ష‌ల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌లేదు. ఏంది ఈ దుర్మార్గం. మన రాష్ట్రంలో త‌ప్పా ఎక్క‌డా కూడా 24 గంట‌ల విద్యుత్ ఇవ్వ‌డం లేదు. కార్పొరేట్ల జేబులు నింపేందుకు బీజేపీ య‌త్నిస్తోంది.

ప్ర‌యివేటీక‌ర‌ణ అనే పాల‌సీని బీజేపీ అవలంభిస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట విద్యుత్ మీట‌ర్లు పెడుతామ‌ని చెబుతున్నారు. మీట‌ర్ల‌కు ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేదు. మీట‌ర్ల‌ను పెట్టుకుని కొంప‌ల‌ను పొగొట్టుకుందామా? ఈ విష‌యంపై ఆలోచించాలి. ఎన్నిక‌ల్లో చేసే దుర్మార్గ‌పు ప్ర‌లోభాల‌కు ఆశ ప‌డితే గోస ప‌డుతాం.

నా బ‌లగం, నా శ‌క్తి మీరే. మీ బ‌లం చూసే మేం కొట్లాడేది. మీరే స‌హ‌క‌రించ‌క‌పోతే మేం ఏం చేయ‌ గ‌లుగుతాం. ఇవాళ మీట‌ర్లు పెట్టేవారికి ఏం అవ‌కాశం ఇచ్చినా న‌న్ను ప‌క్క‌కు జ‌రిపేస్తారు. కేసీఆర్‌ను ప‌డ‌గొట్టి, తెలంగాణ‌ను క‌బ్జా చేద్దామ‌నుకున్నారు. ప్ర‌యివేటీక‌ర‌ణ చేద్దామ‌నుకునే వాళ్ల‌కు బుద్ధి చెప్పాలి.

70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. భార‌త‌దేశంలో బంగారం లాంటి భూమి ఉంది. మాన‌వ సంప‌ద ఉన్న‌ది. ఇవ‌న్నీ వ‌దిలిపెట్టి వ్య‌వ‌సాయాన్ని కూడా కార్పొరేట్ గ‌ద్ద‌ల‌కు అప్ప‌జెప్పే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. రైతులు గ‌మ‌నించాలి. న‌ష్ట‌పోయేది, కష్ట‌ప‌డేది మ‌న‌మే అనేది గుర్తుకు తెచ్చుకోవాలి.

గ‌త పాల‌కుల హ‌యాంలో నీటి గోస తీరిందా? ఫ్లోరోసిస్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేదు. మునుగోడు ప్ర‌జ‌ల‌ను కాపాడండి అంటే నాటి బీజేపీ ప్రభుత్వం స్పందించ‌లేదు. నేను కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఏడ్చినా.. శివ్వ‌న్న‌గూడెంలో నిద్ర చేసి, మేధావుల‌తో మాట్లాడి చైత‌న్యం తీసుకొచ్చాను.

చూడు చూడు న‌ల్ల‌గొండ‌.. గుండె మీద ఫ్లోరైడ్ బండ అని రాశాను. ఆ పాట నేనే రాశాను. న‌ల్ల‌గొండ‌, మునుగోడుకే కాదు.. భార‌త్‌కే న‌ర‌కం చూపే జెండాలు మ‌న మ‌ధ్య తిరుగుతున్నాయి. వాటిని గుర్తుప‌ట్టాలి. ప్ర‌జ‌ల్లో అమాయ‌క‌త్వం ఉంట‌దో.. అప్ప‌టి దాకా దుర్మార్గుల ఆట‌లు కొన‌సాగుతాయి. ఓటర్లు అంద‌రూ అల‌వోక‌గా ఓటేసి ఇబ్బంది ప‌డొద్దు.

కేంద్రం అవ‌లంభించే విధానాల వ‌ల్ల విద్యుత్, నీటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఎనిమిదేండ్ల కింద మ‌న తెలంగాణ‌ను గుర్తు చేసుకోండి. కానీ మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ ప‌చ్చ‌బ‌డ్డ‌ది. తెలంగాణ‌ లాగే దేశాన్ని త‌యారు చేయాల‌ని పుట్టుకొస్తున్న‌దే బీఆర్ఎస్ పార్టీ.

మునుగోడు ప్ర‌జ‌ల‌కు ఇదో గొప్ప అవ‌కాశం. చరిత్ర‌లో సువ‌ర్ణ అవకాశం ఈ మునుగోడుకే ద‌క్కింది. బీఆర్ఎస్‌కు పునాది రాయి పెట్టే అవ‌కాశం మీకే ద‌క్కింది. సిద్దిపేట ప్ర‌జ‌లు నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు. ఈ విజ‌యంతోనే దేశం బాగు ప‌డుత‌ది. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను. మీకు అండ‌దండ‌గా ఉంటాను.

బీఆర్ఎస్ పార్టీకి పునాదిరాయి పెట్టింది మునుగోడు. మీరే ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి. దేశం బాగు పడాలంటే మీరు అడుగు ముందుకేయాలి. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా. దేశంలో జరిగే పోరాటంలో మీరే పునాది రాయి వేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవాలి. ఎనిమిదేళ్ళయినా మా నీళ్ళు చూపడానికి, మా వాటా ఎప్పుడిస్తావు? నేను మహా మొండి.

వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవిన్యూ డివిజన్ చేస్తా. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లో మీ కోరిక నెరవేరుస్తా. ప్రజల్లో ఉండే మనిషిని ఓడించి.. రాజగోపాల్ రెడ్డిని 2018లో గెలిపించారు. గొడ్డలిని గెలిపించారు అభివృద్ది లేదు. రోడ్లన్నీ బాగుచేస్తా. గెలిచిన వారు పత్తా లేరు. కష్టానికి వచ్చారు. ఆయన్ని గెలిపించండి అంటూ ముగించారు.

Exit mobile version