Site icon vidhaatha

భార‌త్ గెలిచింది.. మాజీ క్రికెట‌ర్లు గంతేశారు

విధాత: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ‌ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజ‌యాన్నిసాధించి దేశ ప్ర‌జ‌ల‌కు ఒక‌రోజు ముందుగానే దిపావ‌ళి పండుగ తెచ్చింద‌ని క్రికెట్ అభిమానులు సంబుర‌ ప‌డుతున్నారు. విజయానికి కావాల్సిన ఒక్క పరుగును ఆఖరి బంతికి రవిచంద్రన్‌ అశ్విన్‌ తీయగానే.. దేశం మొత్తం ఎగిరి గంతేసింది.

ఇక స్టేడియంలోనే ఉన్న భార‌త‌ మాజీ క్రికెటర్లు సునిల్‌ గావస్కర్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు కూడా అభిమానుల్లా అదే పని చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version