విధాత: సూర్యాపేట జిల్లా తుంగతూర్తి నియోజకవర్గం పరిధిలోని అర్వపల్లి శ్రీయోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి కి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య, నల్లబోతు భాస్కరరావు తదితరులు ఉన్నారు.