సాగర్ నియోజకవర్గంలో BRS వర్గాల రచ్చ.. ఫ్లెక్సీల చించివేత

విధాత: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ అధికార పార్టీ బీఆర్ఎస్‌లో నెలకొన్న వర్గ విభేదాలు ఆదివారం రాత్రి రోడ్డున పడ్డాయి. రేపు జరగాల్సిన నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణస్వీకారానికి ముందే ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను చింపుకొని వీధిన పడ్డారు.. రోడ్ల పైనే పరస్పరం వాగ్వివాదాలకు దిగారు. వివరాల్లోకి వెళితే.. నిడమానూరు మార్కెట్ కమిటీ నిడమానూరు, త్రిపురారం రెండు మండలాల పరిధి లోనిది.. వరుసగా మూడు పర్యాయాలు త్రిపురారం మండలానికి చెందిన వ్యక్తికే చైర్మన్ పదవి అప్పగించడంపై గత […]

  • Publish Date - January 22, 2023 / 05:26 PM IST

విధాత: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ అధికార పార్టీ బీఆర్ఎస్‌లో నెలకొన్న వర్గ విభేదాలు ఆదివారం రాత్రి రోడ్డున పడ్డాయి. రేపు జరగాల్సిన నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణస్వీకారానికి ముందే ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను చింపుకొని వీధిన పడ్డారు.. రోడ్ల పైనే పరస్పరం వాగ్వివాదాలకు దిగారు.

వివరాల్లోకి వెళితే.. నిడమానూరు మార్కెట్ కమిటీ నిడమానూరు, త్రిపురారం రెండు మండలాల పరిధి లోనిది.. వరుసగా మూడు పర్యాయాలు త్రిపురారం మండలానికి చెందిన వ్యక్తికే చైర్మన్ పదవి అప్పగించడంపై గత కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మరోసారి త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వ్యక్తికే చైర్మన్ పదవి అప్పగించడంతో నిడమానూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై కన్నేసిన నియోజక వర్గానికి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరులు ఈ వివాదం వెనుక ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

సోమవారం నిడమనూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి మంత్రి జగదీశ్ రెడ్డి రేపు హాజరుకానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో ఎంపీపీ, సర్పంచ్ ఫోటోలు లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీపీ సామాజిక వర్గం నేతలు సదరు ఫ్లెక్సీలను చించి వేశారు.

ఫ్లెక్సీలలో ప్రోటోకాల్ ప్రకారం నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, స్థానిక సర్పంచ్ మేరెడ్డి పుష్పలత ఫోటోలను ఫ్లెక్సీలలో ప్రచురించక పోవడంతో ఎంపీపీ తనయుడు, ఎంపీపీ సలహాదారు తన అనుచరులతో నిరసన తెలిపారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సత్యపాల్ చూస్తుండగానే చించి వేశారు. ఫ్లెక్సీలలో ఎంపీపీ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ లేక పోవడం పద్ధతేనా అంటూ వారితో వాగ్వాదానికి దిగారు.

ఫ్లెక్సీ ప్రోటోకాల్ పాటించలేదని ఫ్లెక్సీలను చించివేత సంఘటన మార్కెట్ పరిధిలోని నిడమనూరు, త్రిపురారం మండలంలోనే కాకుండా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోను బీఆర్ఎస్ తమ్ముళ్ల మధ్య చర్చనీయాంశం అయింది.

తెల్లవారే లోపు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ లేని ఫ్లెక్సీలను చించి వేస్తామంటూ మార్కెట్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రారెడ్డిని హెచ్చరించడంతో సోమవారం ప్రమాణ స్వీకార సమయంలో పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే స్థానిక సర్పంచ్ ఫొటో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలలో ఫొటోలు లేకపోవడంతో సర్పంచ్ అనుచరులు కూడా గరంగా ఉన్నట్లు తెలుస్తోంది.