విధాత, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నిజాం కుటుంబం ప్రిన్సెస్ బేగం సాహిబా ఎస్రా బిర్గన్ తరఫున నాలుగు లక్షల విలువైన 67 గ్రాముల బంగారు హారాన్ని బహుకరించారు.
యాదగిరిగుట్ట పునర్నిర్మిత నూతన ఆలయంలో జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిజాం కుటుంబం ఈ బంగారు ఆభరణాన్ని విరాళంగా అందించింది.
విరాళ కానుకను వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు నిజాం కుటుంబం తరఫున దేవస్థానం ఈవో గీతకు అందించారు.