Rajasthan | గిరిజ‌న మ‌హిళ బ‌ట్ట‌లూడ‌దీసి.. న‌గ్నంగా ఊరేగించారు..

Rajasthan | విధాత‌: అనుమానంతో ఓ గిరిజ‌న మ‌హిళ బ‌ట్ట‌లూడ‌దీసి.. న‌గ్నంగా ఊరేగించారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ప్ర‌తాప్‌ఘ‌ర్ జిల్లాలో గురువారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌తాప్‌ఘ‌ర్ జిల్లాకు చెందిన ఓ గిరిజ‌న వివాహిత‌(21)ను ఆమె భ‌ర్త అనుమానించ‌డం మొద‌లు పెట్టాడు. మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుంద‌ని కుటుంబ స‌భ్యులు అనుమానించారు. ఈ క్ర‌మంలోనే గురువారం రాత్రి ఆమెను దారుణంగా కొట్టారు. అనంత‌రం వివ‌స్త్ర‌ను చేశారు. అంతటితో ఆగ‌కుండా […]

  • Publish Date - September 2, 2023 / 06:35 AM IST

Rajasthan |

విధాత‌: అనుమానంతో ఓ గిరిజ‌న మ‌హిళ బ‌ట్ట‌లూడ‌దీసి.. న‌గ్నంగా ఊరేగించారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని ప్ర‌తాప్‌ఘ‌ర్ జిల్లాలో గురువారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌తాప్‌ఘ‌ర్ జిల్లాకు చెందిన ఓ గిరిజ‌న వివాహిత‌(21)ను ఆమె భ‌ర్త అనుమానించ‌డం మొద‌లు పెట్టాడు.

మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుంద‌ని కుటుంబ స‌భ్యులు అనుమానించారు. ఈ క్ర‌మంలోనే గురువారం రాత్రి ఆమెను దారుణంగా కొట్టారు. అనంత‌రం వివ‌స్త్ర‌ను చేశారు. అంతటితో ఆగ‌కుండా న‌గ్నంగా ఊరేగించారు.

కొంద‌రు స్థానికులు ఈ దృశ్యాల‌ను త‌మ మొబైల్స్‌లో చిత్రీక‌రించి, సామాజిక మాధ్య‌మాల్లో వైల‌ర్ చేశారు. త‌న‌ను ర‌క్షించండి.. అని ఆమె మొర‌పెట్టుకున్న‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రూ కూడా క‌నిక‌రించ‌లేదు. ఆమెను ఎవ‌రూ చేర‌దీయ‌లేదు.

బాధిత మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి ఊరేగించిన ఘ‌ట‌న‌లో ఆమె భ‌ర్త‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుని, క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పోలీసులు తెలిపారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న‌ను రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు.

Latest News