south central railway | ప్రయాణికులకు అలెర్ట్‌..! విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు..!

south central railway | దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని పలు రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 14న తాడి - అనకాపల్లి స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన విషయం విధితమే. దాంతో విశాఖపట్నం - విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో భద్రతా పనుల దృష్ట్యా రైల్వేశాఖ ఈ మార్గంలో పలు రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల శనివారం (జూన్‌ 17) […]

  • Publish Date - June 17, 2023 / 02:30 AM IST

south central railway | దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని పలు రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 14న తాడి – అనకాపల్లి స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన విషయం విధితమే.

దాంతో విశాఖపట్నం – విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో భద్రతా పనుల దృష్ట్యా రైల్వేశాఖ ఈ మార్గంలో పలు రైలు సర్వీసులను రద్దు చేసింది.

ఈ నెల శనివారం (జూన్‌ 17) రోజున గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17239),

18న విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17240),

17న విశాఖపట్నం-విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ (రైలు22701),

17న విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.22702),

17న మచిలీపట్నం-విశాఖపట్నం (రైలు నం.17219),

18న విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.17220) రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వివరించింది. ప్రయాణికులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.

Latest News