south central railway | దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని పలు రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 14న తాడి - అనకాపల్లి స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం విధితమే. దాంతో విశాఖపట్నం - విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో భద్రతా పనుల దృష్ట్యా రైల్వేశాఖ ఈ మార్గంలో పలు రైలు సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల శనివారం (జూన్ 17) […]
south central railway | దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని పలు రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 14న తాడి – అనకాపల్లి స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం విధితమే.
దాంతో విశాఖపట్నం – విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో భద్రతా పనుల దృష్ట్యా రైల్వేశాఖ ఈ మార్గంలో పలు రైలు సర్వీసులను రద్దు చేసింది.
ఈ నెల శనివారం (జూన్ 17) రోజున గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ (రైలు నం.17239),
18న విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ (రైలు నం.17240),
17న విశాఖపట్నం-విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ (రైలు22701),
17న విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ (రైలు నం.22702),
17న మచిలీపట్నం-విశాఖపట్నం (రైలు నం.17219),
18న విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్ప్రెస్ (రైలు నం.17220) రైలును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వివరించింది. ప్రయాణికులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.