ఈనెల 27 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీలు

విధాత‌: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, […]

  • Publish Date - January 20, 2023 / 04:22 PM IST

విధాత‌: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ నెల 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తి షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు