Site icon vidhaatha

Bollywood | రాజ‌కీయాల‌తో బాలీవుడ్‌కు చిగురిస్తున్న బంధం

Bollywood |
విధాత‌: రాజ‌కీయాల‌కు, సినిమాల‌కు ఉన్న సంబంధాల గురించి అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా, బాలీవుడ్ (Bollywood0 హీరోయిన్ ప‌రిణితీ చోప్రాల వివాహం నేప‌థ్యంలో ఈ చ‌ర్చ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈ రెండు రంగాల‌లోని వారు జంట కావ‌డం మాత్రం టాలీవుడ్‌లో ఉన్నంత‌గా బాలీవుడ్‌లో లేద‌న్న‌ది గ‌మ‌నించాల్సిన విష‌యం. కానీ ఇప్ప‌డు ప‌రిస్థితి మారిన‌ట్టే క‌నిపిస్తోంది. \
బాలీవుడ్ భామ‌లు ఏరికోరి రాజ‌కీయాల నుంచి వారి భాగ‌స్వాముల‌ను ఎంచుకుంటున్నారు. ఇటీవ‌లే స్వ‌రాభాస్క‌ర్ స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కుడు ఫాహ‌ద్ అహ్మ‌ద్ ను మ‌నువాడ‌గా.. తాజాగా ప‌రిణితీ చోప్రా ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాతో ఏడ‌డుగులు వేసింది. దీంతో సౌత్ త‌ర‌హాలోనే సినిమాకు రాజ‌కీయాల‌కు బంధం పెరుగుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.
Exit mobile version