Site icon vidhaatha

Hyderabad | నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

Hyderabad |

విధాత: ఈ నెల 8వ తేదీన (నేడు)హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ర్య‌టించ‌నున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఈప‌ర్య‌ట‌న‌లో భాగంగా మోదీ సికింద్రాబాద్-తిరుప‌తి వందే భార‌త్ రైలును ప్రారంభించ‌నున్నారు. ప‌రేడ్ గ్రౌండ్ నుంచి శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు, వివిధ ప్రాజెక్టుల‌ను మోదీ జాతికి అంకితం చేయ‌నున్నారు. అనంత‌రం ప‌రేడ్ గ్రౌండ్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ ప్ర‌సంగించ‌నున్నారు.

ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..

Exit mobile version