Site icon vidhaatha

25న యాదాద్రి ఆలయం మూసివేత

విధాత, యాదాద్రి: ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇక 25వ తేదీన నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేయనున్నారు. 26న నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు.

ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే. అంతేకాకుండా 27 ఏళ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడడం విశేషం. పాక్షికంగా ఏర్పడనున్న ఈ గ్రహణం యురోపియన్‌ కంట్రీ-స్‌, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాలతో పాటు- మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

ఈ పాక్షిక సూర్యగ్రహణం న్యూఢిల్లీలో కనిపించనుంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. 26న సంప్రోక్షణ నిర్వహించి ఉదయం 10:30 నిమిషాలకు ఆలయాన్ని తిరిగి అధికారులు తెరవనున్నారు. ఆ తర్వాత యాథావిధిగా నిత్య కైంకర్యములు జరుగుతాయని అధికారులు తెలిపారు.

Exit mobile version