రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
విధాత: ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటూ అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. రకరకాల ప్రమాదాల బారిన పడుతూ పలువురు విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి న్యూయార్క్ నగరంలో అర్ధరాత్రిడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో యువతి దుర్మరణం పాలయ్యారు.
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుంటిపల్లి సౌమ్య (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. సౌమ్య చదువుతోపాటు పార్ట్టైమ్ జాబ్ కూడా చేస్తోంది. అయితే, ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.