సీపీఆర్వోగా అయోధ్య రెడ్డి

ముఖ్యమంత్రి సీపీఆర్వో( చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) గా సీనియర్ పాత్రికేయుడు బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న‌ది. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలానికి చెందిన అయోధ్య రెడ్డి

  • Publish Date - December 12, 2023 / 03:25 PM IST

విధాత : ముఖ్యమంత్రి సీపీఆర్వో( చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) గా సీనియర్ పాత్రికేయుడు బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న‌ది. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలానికి చెందిన అయోధ్య రెడ్డి సుదీర్ఘకాలం ప్రింట్ మీడియాలో ప‌నిచేశారు. ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలల్లో వివిధ హోదాలలో పనిచేశారు . అయితే కొంతకాలంగా జర్నలిజానికి దూరంగా ఉన్న ఆయ‌న‌, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులైనప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. పీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అయోధ్య రెడ్డిని సీపీఆర్వోగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన‌ట్లు తెలిసింది. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.