విధాత: బీఅరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి రావాలని సందేశం పంపించారు. మంగళవారం ఆయన తన ఫామ్ హౌస్ లో వారితో భేటీ కాను. తాజా రాజకీయ పరిస్థితులు, బీఅరెస్ నుంచి కొనసాగుతున్న వలసలపై ఆయన వారితో కీలక చర్చలు జరపరునున్నట్లు సమాచారం. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేజారిపోతారోనన్న ఆందోళనతో ఉన్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారు పార్టీ విడకుండా బుజ్జగించనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా అనుసరించాల్సిన వైఖరిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. జులై 15వ తేదీలోగా మరో 15 మంది బీఅరెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. పార్టీ సంస్థాగత బలోపేత అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది.
బీఅరెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు… ఫామ్ హౌస్ కి రావాలని సందేశం
బీఅరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి రావాలని సందేశం పంపించారు.

Latest News
ఏఐ ఇంపాక్ట్ ఎఫెక్ట్.. ఒక్క నైట్ స్టేకి రూ.35 లక్షలు.. ఢిల్లీలో విపరీతంగా పెరిగిన హోటల్ గదుల ధరలు
తెలంగాణలో రాజకీయ ‘పునరేకీకరణ’.. కాంగ్రెస్, సీపీఐ పక్షాల మధ్య మిత్రభేదం
Bengaluru | తల్లి ప్రైవేట్ ఫొటోలను బాయ్ ఫ్రెండ్కు పంపిన కుమార్తె
క్యాన్సర్ చికిత్సలో విప్లవం.. లుకేమియాకు చికిత్స సాధ్యమే!
అంబటికి రిమాండ్ కష్టాలు..మరో కేసులో 14 రోజుల రిమాండ్
నేను ఠాకూర్ను.. నాతో పెట్టుకోకు.. కస్టమర్కు బ్యాంకు ఉద్యోగిని మాస్ వార్నింగ్
Burger | ఈ బర్గర్ ఖరీదు రూ.17,785.. ఎందుకింత స్పెషల్
ఈ వారం ఓటీటీలో వినోదాల విందు..
క్లాస్ రూమ్ లోనే తోటి విద్యార్థిని గన్ తో కాల్చి విద్యార్థి ఆత్మహత్య
మార్చి 31న రిటైర్ కానున్న సీఎస్...14సార్లు తెలంగాణ బడ్జెట్ రూపకల్పన