Site icon vidhaatha

నిండుకుండలా ప్రాజెక్టులు

విధాత:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్టులు నిండుకుండల మారుతున్నాయి.జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 600 క్యూసెక్కులు ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 171.028 అడుగులకు చేరింది.పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 39.83 టీఎంసీలుగా ఉంది.పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.

Exit mobile version