విధాత: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశద్రోహి అన్న భాజపా నేతల వ్యాఖ్యలపై.. మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కొవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదిపాటు రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ రైతులకు ఆపన్నహస్తం అందించినవారు ద్రోహులవుతారా అని కేటీఆర్ అడిగారు. దేశభక్తిపై సర్టిఫికేట్ ఇవ్వడానికి వీళ్లెవరని మంత్రి మండిపడ్డారు. కాగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు కేసీఆర్ ఆర్థిక సాయం చేయడంపై భాజపా నేతలు మండిపడ్డారు. ఆయన దేశద్రోహిగా పేర్కొంటూ పలు వ్యాఖ్యలు చేశారు.