అమిత్‌ షా పర్యటనలో భద్రతా లోపం.. వెంటే తిరిగిన అపరిచిత వ్యక్తి

విధాత‌: కేంద్ర హోం మంత్రి పర్యటనలో భద్రతా లోపం క‌ల‌కలం సృష్టించింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ వారం మొదట్లో మహారాష్ట్ర రాజధాని ముంబయికి వచ్చిన కేంద్రమంత్రి అమిత్‌ షా పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడిందని గురువారం పోలీసులు వెల్లడించారు. హోం శాఖ అధికారినని చెప్పుకొంటూ.. అమిత్‌ షా వెంటే తిరిగిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ వారం కేంద్ర హోం మంత్రి రెండు రోజుల పాటు ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడ […]

  • Publish Date - September 8, 2022 / 05:59 AM IST

విధాత‌: కేంద్ర హోం మంత్రి పర్యటనలో భద్రతా లోపం క‌ల‌కలం సృష్టించింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ వారం మొదట్లో మహారాష్ట్ర రాజధాని ముంబయికి వచ్చిన కేంద్రమంత్రి అమిత్‌ షా పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడిందని గురువారం పోలీసులు వెల్లడించారు. హోం శాఖ అధికారినని చెప్పుకొంటూ.. అమిత్‌ షా వెంటే తిరిగిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

ఈ వారం కేంద్ర హోం మంత్రి రెండు రోజుల పాటు ముంబయి పర్యటనకు వెళ్లారు. అక్కడ బీజేపీ నేతలతో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. బుధవారం ఆ పర్యటన ముగిసింది. అయితే.. ఈ పర్యటనలో ఓ భద్రతా వైఫల్యాన్ని గుర్తించారు.

ఓ వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో కనిపించాడు. కొన్ని గంటల పాటు అమిత్‌ షాకు దగ్గర్లోనే చక్కర్లు కొట్టాడు. అయితే.. అతని వ్య‌వ‌హార‌శైలి అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వెంటనే ముంబయి పోలీసులకు సమాచారం అందించారు. అతడి పేరు హేమంత్‌ పవార్‌గా గుర్తించారు.

భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి, ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ అనుచరుడినని అతడు చెప్పుకొన్నట్లు తెలిపారు. అయితే.. అతడు ఏ ఎంపీ పేరు చెప్పి వెళ్లాడనే వివరాలు తెలియరాలేదు.