గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో పిల్లల చదవుకు తీరని నష్టం వాటిల్లిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
- చిన్నారుల కోసం కొవిడ్ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.
★ పిల్లల కోసం కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.
★ తద్వారా పాఠశాలలను పునఃప్రారంభించటం సహా చిన్నారులు స్వేచ్ఛగా బహిరంగ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు.
★ 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సమాచారం సెప్టెంబర్ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు గులేరియా.
★ “కొవిడ్ మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడింది. పాఠశాలలను పునఃప్రారంభించటంలో చిన్నారులకు టీకా అందించే ప్రక్రియ.. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారత్ బయోటెక్ కంటే ముందే ఫైజర్ వ్యాక్సిన్.. చిన్నారులు కోసం అందుబాటులోకి వస్తే అది సదవకాశమే. జైడస్ వ్యాక్సిన్కు అనుమతి లభించినా అది మరో అవకాశమే.” అని డాక్టర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ చీఫ్ అన్నారు.
★ పిల్లలకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలే లేకపోయినా కూడా వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని గులేరియా హెచ్చరించారు.
★ మహమ్మారి కోరల నుంచి బయటపడాలంటే టీకా ప్రక్రియను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
★ ఫార్మా దిగ్గజం జైడస్ క్యాడిలా సంస్థ తమ జైకోవ్-డి టీకాకు అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
★ ఈ టీకాను పెద్దలతో పాటు చిన్నారులకూ అందివచ్చని ఆ సంస్థ చెబుతోంది.