పిల్లలకు టీకాపై ఎయిమ్స్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో పిల్లల చదవుకు తీరని నష్టం వాటిల్లిందని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్ రణదీప్​ గులేరియా తెలిపారు. చిన్నారుల కోసం కొవిడ్​ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ★ పిల్లల కోసం కొవిడ్​ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా పేర్కొన్నారు. ★ తద్వారా పాఠశాలలను పునఃప్రారంభించటం సహా చిన్నారులు స్వేచ్ఛగా బహిరంగ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని […]

పిల్లలకు టీకాపై ఎయిమ్స్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

గత ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారితో పిల్లల చదవుకు తీరని నష్టం వాటిల్లిందని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్ రణదీప్​ గులేరియా తెలిపారు.

  • చిన్నారుల కోసం కొవిడ్​ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.

★ పిల్లల కోసం కొవిడ్​ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా పేర్కొన్నారు.

★ తద్వారా పాఠశాలలను పునఃప్రారంభించటం సహా చిన్నారులు స్వేచ్ఛగా బహిరంగ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు.

★ 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​​ సమాచారం సెప్టెంబర్​ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు గులేరియా.

★ “కొవిడ్ మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడింది. పాఠశాలలను పునఃప్రారంభించటంలో చిన్నారులకు టీకా అందించే ప్రక్రియ.. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారత్​ బయోటెక్ కంటే ముందే ఫైజర్​ వ్యాక్సిన్​.. చిన్నారులు కోసం అందుబాటులోకి వస్తే అది సదవకాశమే. జైడస్​ వ్యాక్సిన్​కు అనుమతి లభించినా అది మరో అవకాశమే.” అని డాక్టర్​ రణదీప్​ గులేరియా, ఎయిమ్స్​ చీఫ్​ అన్నారు.

★ పిల్లలకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలే లేకపోయినా కూడా వారి ద్వారా ఇతరులకు వైరస్​ వ్యాపించే ప్రమాదం ఉందని గులేరియా హెచ్చరించారు.

★ మహమ్మారి కోరల నుంచి బయటపడాలంటే టీకా ప్రక్రియను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

★ ఫార్మా దిగ్గజం జైడస్​ క్యాడిలా సంస్థ తమ జైకోవ్​-డి టీకాకు అత్యవసర వినియోగం కోసం డ్రగ్​ కంట్రోలర్​ జనరల్ ఆఫ్​ ఇండియా(డీసీజీఐ)కి త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

★ ఈ టీకాను పెద్దలతో పాటు చిన్నారులకూ అందివచ్చని ఆ సంస్థ చెబుతోంది.