విధాత,తిరుమల: శ్రీవారి భక్తులకు ఉదయం,సాయంత్రం వేర్వేరు వంటకాలతో రుచికరమైన భోజనం అందించాలని తితిదే నిర్ణయించిందని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్న మయ్య భవనంలో గురువారం కూర గాయల దాతలతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భ క్తులకు రుచికరంగా 14 రకాల వెరైటీల తో భోజనాన్ని అందించేందుకు తితిదే చర్యలు చేపట్టిందని వివరించారు.
అన్న ప్రసాదం విభాగం కోరిన ప్రకారం కూర గాయలను సరఫరా చేయాలని దాత లను కోరారు. ప్రతిరోజు కూరలు, సాం బారు, రసం చేయడానికి మాతృశ్రీ తరి గొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం లో రోజుకు 90 యూనిట్లు అవుతుంద ని అందులో ఉదయం 56 యూనిట్లు, రాత్రి 34 యూనిట్లు (ఒక యూనిట్ 250 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించడానికి సమానం) తయారు చేస్తున్నట్లు చెప్పారు.