Site icon vidhaatha

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం

రాజధాని ఢిల్లీలో ఇవాళ స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది.
మధ్యాహ్నం 12:02 గంటల సమయంలో ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో భూమి కంపించింది.

★ రికర్ట్ స్కేలుపై దీని తీవ్రత 2.1గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది.

★ నార్త్ వెస్ట్ ఢిల్లీకి 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.

★ అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదు.

★ అటు, గత నెల మే 31వ తేదీన కూడా దేశ రాజధానిలో భూమి కంపించిన సంగతి తెలిసిందే.

★ ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో రాత్రి వేళ అప్పుడు భూకంపం సంభవించింది.

★ రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.4 గా నమోదైంది.

★ దాంతో రాత్రివేళ అక్కడి ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు.

★ ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

★ అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో అప్పుడు కూడా ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించలేదు.

★ అయితే, తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ హస్తినలో వరుస భూకంపాలు అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

అసలు.. భూకంపం ఎందుకు సంభవిస్తుంది..?

★ భూమి అనేక పొరలుగా విభజించబడింది.

★ భూమి క్రింద అనేక రకాల ప్లేట్లు ఉన్నాయి.

★ అయితే కలిసి ఉన్న ప్లేట్లు భూమి లోపలి ఉష్ణోగ్రతల ఆధారంగా ఆ ప్లేట్లు అటూ ఇటూ కదులుతుంటాయి.

★ ఫలితంగా భూకంపం సంభవిస్తుంటుంది.

★ అయితే, ఇటీవలి కాలంలో దేశంలో తరచూ భూమి కంపిస్తూనే ఉంది.

Exit mobile version