దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం
రాజధాని ఢిల్లీలో ఇవాళ స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది.మధ్యాహ్నం 12:02 గంటల సమయంలో ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో భూమి కంపించింది. ★ రికర్ట్ స్కేలుపై దీని తీవ్రత 2.1గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. ★ నార్త్ వెస్ట్ ఢిల్లీకి 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ★ అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదు. ★ అటు, గత నెల మే […]

రాజధాని ఢిల్లీలో ఇవాళ స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది.
మధ్యాహ్నం 12:02 గంటల సమయంలో ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో భూమి కంపించింది.
★ రికర్ట్ స్కేలుపై దీని తీవ్రత 2.1గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది.
★ నార్త్ వెస్ట్ ఢిల్లీకి 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
★ అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదు.
★ అటు, గత నెల మే 31వ తేదీన కూడా దేశ రాజధానిలో భూమి కంపించిన సంగతి తెలిసిందే.
★ ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో రాత్రి వేళ అప్పుడు భూకంపం సంభవించింది.
★ రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 2.4 గా నమోదైంది.
★ దాంతో రాత్రివేళ అక్కడి ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు.
★ ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
★ అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో అప్పుడు కూడా ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించలేదు.
★ అయితే, తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ హస్తినలో వరుస భూకంపాలు అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అసలు.. భూకంపం ఎందుకు సంభవిస్తుంది..?
★ భూమి అనేక పొరలుగా విభజించబడింది.
★ భూమి క్రింద అనేక రకాల ప్లేట్లు ఉన్నాయి.
★ అయితే కలిసి ఉన్న ప్లేట్లు భూమి లోపలి ఉష్ణోగ్రతల ఆధారంగా ఆ ప్లేట్లు అటూ ఇటూ కదులుతుంటాయి.
★ ఫలితంగా భూకంపం సంభవిస్తుంటుంది.
★ అయితే, ఇటీవలి కాలంలో దేశంలో తరచూ భూమి కంపిస్తూనే ఉంది.