Site icon vidhaatha

శ్రీవారి సేవలో మంత్రి సత్యవతి రాథోడ్

విధాత,తిరుమల: తిరుమల శ్రీవారిని మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జల్లాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సత్యవతి రాథోడ్ వెల్లడించారు.కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో ఈ అంశం కోర్టుకి వెళ్లిందన్నారు. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితోనైనా పోరాటం చేస్తారన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.

Exit mobile version