శ్రీవారి సేవలో మంత్రి సత్యవతి రాథోడ్
విధాత,తిరుమల: తిరుమల శ్రీవారిని మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జల్లాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సత్యవతి రాథోడ్ వెల్లడించారు.కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో ఈ అంశం కోర్టుకి వెళ్లిందన్నారు. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితోనైనా పోరాటం చేస్తారన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.

విధాత,తిరుమల: తిరుమల శ్రీవారిని మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జల్లాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సత్యవతి రాథోడ్ వెల్లడించారు.కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో ఈ అంశం కోర్టుకి వెళ్లిందన్నారు. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితోనైనా పోరాటం చేస్తారన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.