అమరావతి : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రూ.2.4 కోట్ల విలువైన సుమారు 2.5 కిలోల బరువున్న బంగారు శంఖుచక్రాలు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఈ బంగారు కానుకలను శ్రీవారికి సమర్పించింది. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరికి దాతలు ప్రత్యేక పూజల అనంతరం శంకుచక్రాలను అందజేశారు.