Site icon vidhaatha

కొత్తకేసులు 3.68లక్షలు.. మరణాలు 3417

దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతూనే ఉంది. విచ్చలవిడిగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి రోజూ లక్షల మందిపై ప్రతాపం చూపుతూ వికటాట్టహాసం చేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 3.68లక్షల మంది కొవిడ్‌ బారిన పడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

నెమ్మదిగా వ్యాక్సినేషన్‌..

ఇక దేశంలో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెనమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల టీకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కేవలం 12లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఇప్పటి వరకు 15.71కోట్ల మంది టీకాలు తీసుకున్నారు.

Exit mobile version