విధాత:అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అతికొద్ది రోజుల్లోనే కీలక నగరాలను హస్తగతం చేసుకున్న తాలిబన్లు… ఆదివారం రాజధానిలోకీ ప్రవేశించినట్టు సమాచారం. కాబుల్ శివార్లలోని కలాకన్, ఖారాబాఘ్, పఘ్మన్ జిల్లాలు ఇప్పటికే ముష్కరుల వశమైనట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం అధికారులు ముగ్గురు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. కాబుల్లోకి ప్రవేశించామని తాలిబన్లు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే… అనేక ప్రభుత్వ కార్యాలయాలు తమ ఉద్యోగులను అర్థంతరంగా ఇళ్లకు పంపేశాయి. కాబుల్లోని కీలక ప్రాంతాల్లో సైనిక హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ కనిపించాయి.