ప్రస్తుత కాలంలో ఏటీఎంలు బ్యాంకింగ్ సేవలను చాలా సౌకర్యవంతంగా మార్చాయి. ప్రజలు బ్యాంకులకు వెళ్లడం తగ్గించారు. కానీ మరోవైపు ఈ ఏటీఎం మెషీన్లను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు చేసే ప్రమాదం కూడా పెరుగుతోంది. దీనితో పాటు ఏటీఎం పిన్‌ను దొంగిలించడం, ఇతరుల నుండి డబ్బు విత్‌డ్రా చేయడం వంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.

ఈ సమయంలో ఏటీఎం పిన్‌ను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మోసగాళ్లు రకరకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. మీ చిన్న పొరపాటు మీ పెద్ద సంపాదనను దొంగిలించగలదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏటీఎం నుండి డబ్బు విత్‌డ్రా చేసిన తర్వాత క్యాన్సల్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే ఏటీఎం పిన్ సురక్షితంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజంగా నిజమేనా?

గత సంవత్సరం ప్రభుత్వ సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేసిన ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వాదనను ఖండించింది. ప్రభుత్వం గానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ అటువంటి సలహా లేదా ఆదేశం ఏదీ జారీ చేయలేదని ఆ ప్రభుత్వ సంస్థ తెలిపింది.

నిజం ఏమిటంటే ఏటీఎం మెషీన్‌లో ఉండే క్యాన్సల్ బటన్ కేవలం కొనసాగుతున్న లావాదేవీని రద్దు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది హ్యాంకింగ్ లేదా కార్డ్ స్కిమ్మింగ్ వంటి ప్రమాదాలను నివారించదు. అటువంటి వదంతులను నమ్మవద్దని ఏజెన్సీ ప్రజలకు సలహా ఇచ్చింది.

కార్డ్ స్కిమ్మింగ్, ఫిషింగ్ , కీప్యాడ్ ట్యాంపరింగ్ వంటి పద్ధతులు ప్రజలకు భారీ ఆర్థిక నష్టాలను కలిగించగలవు. అటువంటి పరిస్థితిలో మీ డబ్బు , ఏటీఎం పిన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

కార్డ్ రీడర్‌ను తనిఖీ చేయండి. కార్డ్ పెట్టే చోట స్కిమ్మింగ్ పరికరాన్ని అమర్చి ఉండవచ్చు. ఏటీఎంలో మీకు ఏదైనా అనుమానాస్పద పరికరం కనిపిస్తే ఆ ఏటీఎంను ఉపయోగించవద్దు. వెంటనే దాని గురించి బ్యాంకుకు తెలియజేయండి.

ఏటీఎం లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ , ఈమెయిల్స్‌పై ఎల్లప్పుడూ ఒక కన్ను వేసి ఉంచండి. ఇది ఏదైనా అనధికార లావాదేవీల గురించి మిమ్మల్ని వెంటనే అప్రమత్తం చేస్తుంది.

 ఒకవేళ మీ కార్డ్ పోయినా లేదా దొంగిలించబడినా, వెంటనే మొబైల్ బ్యాంకింగ్ లేదా బ్యాంకు కస్టమర్ కేర్ ద్వారా దానిని బ్లాక్ చేయండి/లాగ్ చేయండి. ఇది కార్డ్ దుర్వినియోగ అవకాశాలను తగ్గిస్తుంది.