రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం 2026 ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి. వారి వివాహ థీమ్ 'ది పీరియాడిక్ ఎరా'. పెళ్లి చాలా అందంగా జరిగింది. ఈ క్రమంలో అందరి దృష్టి రష్మిక మందన్న ధరించిన ఆకర్షణీయమైన మంగళ్యపై పడింది.
ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రతిఒక్కరూ కరిమానీ చీర, మంగళ్య చీర వంటి డిజైన్ల కోసం తెగ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే మోడ్రన్ టచ్ తో ఉన్న రష్మిక కరిమానీ మంగళ్య చీర ఉత్తమమైన ఎంపిక అని కొందరు భావిస్తున్నారు. దీంతో రష్మిక మంగళ్య చీర, ఆర్నమెంట్స్ అన్నీ హైలైట్ అవుతున్నాయి.
రష్మిక పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీ జ్యువెలర్స్ వారి సాంప్రదాయ బంగారు ఆభరణాలే. శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్, కౌశిక్ కుమార్ ఎన్డిటివితో మాట్లాడుతూ "ఈ ఆభరణాలన్నీ బంగారమే. వీటిలో వజ్రాలు లేవు. స్వచ్ఛత, ప్రతీకాత్మకత, హస్తకళా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ మేము బంగారు ఆభరణాలను తయారుచేశాము.
రష్మిక పెళ్లి ఉంగరాన్ని బంగారంతో తయారు చేశారని, దాని డిజైన్లో ఎలాంటి రత్నాలు లేదా వజ్రాలు వాడలేదని శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. దీనిని పూర్తిగా బంగారంతోనే తయారు చేశారు. ఇది స్వచ్ఛత, శాశ్వతత్వం, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది.