విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఈ కేసులో సీబీఐ మరొకరు అరెస్టు అయ్యారు. హైదరాబాద్కు చెందిన అభిషేక్ బోయినపల్లిని అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఆయనను కోర్టులో హాజరుపరచనున్నది.
ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే సీబీఐ విజయ్ నాయర్ను అరెస్టు చేసింది.
ఆయన తర్వాత అభిషేక్ బోయినపల్లిని అదుపులోకి తీసుకున్నది. ఇదే వ్యవహారంలో సమీర్ మహేంద్రును ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.