Gold Rates | బంగారం కొనుగోలుదారులకు పసిడి ధరలు ఊరటనిస్తున్నాయి. ఆదివారం బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.72,770 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.65,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,770 వద్ద స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.68,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,920 వద్ద నిలకడగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,770 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,770 పలుకుతున్నది.
ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి సైతం స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో కిలోకు రూ.86వేలు పలుకుతున్నది. హైదరాబాద్లో కిలోకు రూ.91వేలుగా ఉన్నది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.