Gold Rate | కొనుగోలుదారులకు పసిడి, వెండి ధరలు భారీ ఊరట కల్పించాయి. ఇటీవల భారీగా పెరుతూ వస్తున్న ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. మంగళవారం బులియన్ మార్కెట్లో భారీగా పతనమైంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1400 తగ్గి.. రూ.66,150కి దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.1530 పతనమై రూ.72,160కి చేరింది. అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే తగ్గుముఖం పట్టింది. కిలోకు రూ.2500 పతనమైంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67వేలకు చేరగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,100 పతనమైంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,160కి తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,310 ధర పలుకుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,160కి దిగివచ్చింది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర పడిపోయింది. కిలోకు రూ.2500 తగ్గడంతో ఢిల్లీలో రూ.83వేలకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.86,500కి చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.