విధాత: శ్రీశైలంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ బాగా పెరిగింది.తెల్లవారుజామున నుండి పాతాళ గంగ వద్ద పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తులు. ఆలయ రాజగోపురం ఎదురుగా గంగాధర మండపం, ఆలయ ఉత్తర భాగాన పెద్ద ఎత్తున దీపాలను భక్తులు వెలిగిస్తున్నారు.ఈరోజు సాయంత్రం కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది.వేలాది మంది శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించేందుకు క్యూలైన్లో వేచివున్నారు.