విధాత:స్టార్ హీరోల బర్త్డే అంటే అభిమానులకు పండగతో సమానం. వారి బర్త్డే రోజు ఏం చేయాలా? అని ఎప్పటి నుంచో ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. తీరా పుట్టినరోజు నాడు వారు చేసే సంబరాలు అంబరాన్ని అంటుతుంటాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ వేడుకలకు కళ తప్పింది. కరోనా కాలంలో బర్త్డే సెలబ్రేషన్స్ వద్దంటూ హీరోలు అభిమానులకు సూచిస్తూ వస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

ఈమేరకు సోషల్ మీడియాలో ఒక లేఖను విడుదల చేశాడు.
గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని కోవిడ్ను జయిస్తాను. ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను.
Latest News
ఆరెంజ్ కలర్ ఔట్ఫిట్ లో మరింత గ్లామరస్ గా మృణాల్
వన జాతర నుంచి ఎన్నికల జాతరలోకి.. అంతా పరకాయ ప్రవేశం
నాజూకు నడుము అందాలతో ఆగం చేస్తున్న రకుల్ ప్రీత్
జోధ్పూర్ టు హైదరాబాద్.. పచ్చిమిర్చిలో డ్రగ్స్ స్మగ్లింగ్.. షాకింగ్ వీడియో
ఉద్యమకారులను అవమానించిందే కేసీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి
బైక్ షోరూమ్లోకి దూసుకెళ్లిన అడవి దున్న.. తర్వాత ఏమైందంటే..?
రెప్పపాటులో మృత్యువును తప్పించుకున్న చిన్నారి.. వీడియో వైరల్
కోఠి కాల్పుల కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు!
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
కాంగ్రెస్ అభ్యర్థులకు రేపు బీ ఫామ్ ల పంపిణీ : సీఎం రేవంత్ రెడ్డి