విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: పుడమి సాహితీ వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో విద్యా, వైద్య, సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, కళా రంగాలలో విశిష్ట కృషి చేసిన.. చేస్తున్నతెలుగు వ్యక్తులకు తెలుగు తేజం జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు-2022 లను అందించనున్నట్లు పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి తెలిపారు.
పురస్కారాల ఎంపిక కు ఈనెల 30 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పురస్కారాల ప్రధానోత్సవ వేడుకలను జనవరి 8 ఆదివారం ఉదయం 10 గంటలకి నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
తెలుగు తేజం జాతీయ విశిష్ట సేవా పురస్కారాల వేడుకలను విజయవంతం చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని కవులు, రచయితలు, కళా, సాహితీ, సాంస్కృతిక రంగాల వారు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.