విధాత: సూర్యాపేట జిల్లా BJP కార్యదర్శి సైదా హుస్సేన్ ఆదివారం మంత్రి జి.జగదీష్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ లో చేరడం జరిగిందని హుస్సేన్ తెలిపారు.