విధాత, హైదరాబాద్ : గత బీఆరెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల, అధికారుల ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిన కేసులో డీఎస్పీ ప్రణిత్రావు కేసును ప్రభుత్వం సిట్కు అప్పగించింది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ప్రణిత్రావును మంగళవారం రాత్రి సిరిసిల్లలో అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. ప్రణిత్రావు అరెస్టు కోసం ఆయన నివాసం వద్ద పోలీసులు మూడు రోజులు రెక్కి నిర్వహించి మరి అతడిని అరెస్టు చేశారు. విచారణలో ప్రణిత్రావు ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్కు ఆదేశించిన, సహకరించిన ఎస్ఐబీ అధికారుల పేర్లను వెల్లడించారని, దీంతో వారి అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందని తెలుస్తుంది. డిఎస్పీ ప్రణిత్రావు కేసును సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులందరిని బయటకు లాగాలని సిట్ను ఆదేశించడంతో ఈ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి డిఎస్పీ ప్రణిత్రావు ప్రభుత్వం మారగానే ట్యాపింగ్కు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో కేసుతో ప్రమేమయమున్న అధికారుల అరెస్టు తప్పదని తేలుతుంది.
ప్రణిత్రావు కేసు సిట్కు బదిలీ.. మాజీ అధికారుల అరెస్టుకు రంగం సిద్ధం
గత బీఆరెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల, అధికారుల ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిన కేసులో డీఎస్పీ ప్రణిత్రావు కేసును ప్రభుత్వం సిట్కు అప్పగించింది
Latest News

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల
మందుబాబు మాస్టర్ మైండ్..పోలీసుల మైండ్ బ్లాక్..!
రప్పా రప్పా ఫైట్..కింగ్ కోబ్రాను కరకర నమిలేసిన ముంగిస
మళ్లీ హాట్ టాపిక్గా శివాజీ -అనసూయ వివాదం..
స్థిరంగా బంగారం, వెండి ధరలు
| శ్రీలీల ఎనర్జీకి ఫిదా అయిన రాజశేఖర్..
పూలు కాదు.. రాళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకునే అమ్మవారి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా!
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆశాభోంస్లే..
రూ.50వేలలోనే అండమాన్ ట్రిప్.. స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ తీసుకొచ్చిన ఐఆర్సీటీసీ!
మునగకాయలతో భలే వ్యాపారం.. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న వృద్ధ రైతు