Gold Rates | సామాన్యులకు షాక్‌..! మరోసారి పెరిగిన బంగారం వెండి, ధరలు.. నేటి ధరలు ఇవే..!

Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్‌కు 1,952 డాలర్లు పలుకుతున్నది. మరో వైపు దేశంలోనూ పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.200 ఉండగా.. రూ.54,850 దిగివచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.210 దిగిరాగా.. రూ.59,840 తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,940కి తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,550 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.54,840 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,840 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,840 వద్ద కొనసాగుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం పసిడి రూ.54,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,840కి దిగివచ్చింది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలోకు రూ.100 పెరిగి రూ.79వేలకు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79వేలు కొనసాగుతున్నాయి.