Heart Attack: క్రికెట్ ఆడుతుండ‌గా గుండెపోటు.. యువకుడు మృతి

విధాత, కరీంనగర్ బ్యూరో: కోవిడ్ తదనంతరం గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. వ్యాయామాలు చేస్తూ, వాకింగ్ చేస్తూ, పెళ్లి వేడుకల్లో నృత్యాలు చేస్తూ క్షణాల్లో కుప్పకూలి మరణించిన వ్యక్తుల తాలూకు ఉదంతాలు రోజూ ఏదో ఒక‌చోట‌ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ అలాగే కుప్పకూలిపోయాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లాపూర్ మండల కేంద్రంలో కేటీఆర్ […]

  • Publish Date - March 21, 2023 / 05:10 PM IST

విధాత, కరీంనగర్ బ్యూరో: కోవిడ్ తదనంతరం గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. వ్యాయామాలు చేస్తూ, వాకింగ్ చేస్తూ, పెళ్లి వేడుకల్లో నృత్యాలు చేస్తూ క్షణాల్లో కుప్పకూలి మరణించిన వ్యక్తుల తాలూకు ఉదంతాలు రోజూ ఏదో ఒక‌చోట‌ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ అలాగే కుప్పకూలిపోయాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

మల్లాపూర్ మండల కేంద్రంలో కేటీఆర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీలలో పాల్గొన్న కొంపెల్లి విష్ణు(35) గుండెపోటుకు గురయ్యారు. క్రీడా మైదానంలోనే కుప్పకూలిన అతన్ని స్నేహితులు మెట్ పల్లి ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

విష్ణు తండ్రి కొంపెల్లి రాజిరెడ్డి 20 ఏళ్ల క్రితమే మృతి చెందారు. తల్లి సరోజన గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. సరోజన ముగ్గురు సంతానంలో ఇద్దరు బిడ్డలు, ఓ కుమారుడు కాగా, చెట్టంత ఎదిగిన కొడుకు మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest News