విధాత: ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ గురువారం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రభుత్వాసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ను మంత్రి పువ్వాడ ఈ సందర్భంగా అభినందించారు.
అటు అడిషనల్ కలెక్టర్ స్నేహలత, భద్రాద్రి జిల్లా ఎస్పీగా పనిచేసిన సునీల్ దత్ భార్య కూడా గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన విషయం తెలిసిందే