విధాత: వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా.. టీ20 సిరీస్కు యంగ్ ప్లేయర్లతో రెడీ అయింది. మరో వైపు వరుస పరాజయాలకు టీ20ల్లో తెరదించాలని న్యూజిలాండ్ ఉంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా రాంచీలో జరిగే తొలి మ్యాచ్ నేడే. హార్దిక పాండ్యా కెప్టెన్సీలో భారత్ జోరు చూపిస్తుందో.. సాంట్నర్ నేతృత్వంలోని కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి..
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 నేడు జరగనుంది. రోహిత్, కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలతో హార్దిక్ కెప్టెన్సీలోని యంగ్ ఇండియా చెలరేగాలని తహతహలాడుతోంది. రాహుల్, షమి, సిరాజ్లకు కూడా ఈ సిరీస్కు విశ్రాంతినిచ్చారు. వన్డే సిరీస్ను 0-3తో ఓడిన కివీస్ జట్టు టీ20 సిరీస్ ఎలా స్టార్ట్ చేస్తుందో చూడాల్సిందే.
పృథ్వీ షాకు చాన్స్ లేనట్లే: ఇషాన్ కిషన్కు తోడుగా.. శుభ్మన్ గిల్ రెండో ఓపెనర్గా బరిలోకి దిగుతాడని కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సిరీస్కు దూరం కాగా, పృథ్వీ షా రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నా.. వన్డేల్లో తాజా ఫామ్తో గిల్కు అవకాశం కల్పిస్తున్నట్లు హార్దిక్ వెల్లడించాడు.
బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి.. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్.. ఆల్రౌండర్గా దీపక్ హుడా బరిలోకి దిగనున్నారు. సీనియర్ పేసర్లు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ , శివమ్ మావి పేస్ భారం మోయనున్నారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, చాహల్లో ఇద్దరికి అవకాశం దక్కనుంది. బ్యాటింగ్లో భారత్ మెరుగ్గానే కనిపిస్తున్నా బౌలింగ్లోనూ పుంజుకోవాల్సివుంది. శివమ్ మావితో కలిసి ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకుంటాడు.
Look who came visiting at training today in Ranchi – the great @msdhoni!