Kashmir | వారం క్రితం ఉగ్ర‌వాదుల దాడిలో భ‌ర్త మృతి.. పండంటి మ‌గ‌బిడ్డ‌కు భార్య జ‌న్మ‌

Kashmir | నెల‌లు నిండిన భార్య‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్నాడు. పుట్ట‌బోయే బిడ్డ గురించి క‌ల‌లు కంటున్నాడు. అంతలోనే భ‌ర్త ఉగ్ర తూటాల‌కు బ‌ల‌య్యాడు. భ‌ర్త మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక త‌ల్ల‌డిల్లుతున్న ఆమెకు ప్ర‌స‌వ స‌మ‌యం రానే వ‌చ్చింది. ఓ వైపు భ‌ర్త జ్ఞాప‌కాల‌ను నెమరేసుకుంటూ.. మ‌రో వైపు పురిటినొప్పులు భ‌రిస్తూ.. పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన దీపు కుమార్(27) అనే వ్య‌క్తి జంగ్ల‌ట్ మండిలోని స‌ర్క‌స్‌లో వ‌ర్క‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. గ‌త […]

  • Publish Date - June 5, 2023 / 04:02 PM IST

Kashmir | నెల‌లు నిండిన భార్య‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్నాడు. పుట్ట‌బోయే బిడ్డ గురించి క‌ల‌లు కంటున్నాడు. అంతలోనే భ‌ర్త ఉగ్ర తూటాల‌కు బ‌ల‌య్యాడు. భ‌ర్త మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక త‌ల్ల‌డిల్లుతున్న ఆమెకు ప్ర‌స‌వ స‌మ‌యం రానే వ‌చ్చింది. ఓ వైపు భ‌ర్త జ్ఞాప‌కాల‌ను నెమరేసుకుంటూ.. మ‌రో వైపు పురిటినొప్పులు భ‌రిస్తూ.. పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన దీపు కుమార్(27) అనే వ్య‌క్తి జంగ్ల‌ట్ మండిలోని స‌ర్క‌స్‌లో వ‌ర్క‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. గ‌త నెల 29వ తేదీన రాత్రి 8:30 గంట‌ల స‌మ‌యంలో దీపు కుమార్ పాల ప్యాకెట్ నిమిత్తం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లగా అత‌ను ఇంటికి తిరిగిరాలేదు. ఉగ్ర‌వాదుల తూటాల‌కు బ‌ల‌య్యాడు. విష‌యం తెలుసుకున్న భార్య గుడియా గుండెల‌విసేలా రోదించింది. ఆశ్రున‌య‌నాల మ‌ధ్య క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు దీపు కుమార్‌కు.

ఇక నెల‌లు నిండిన గుడియా త‌న భ‌ర్త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూనే ఉంది. భ‌ర్త అంత్య‌క్రియ‌లు జ‌రిగిన వారం రోజుల‌కు గుడియా పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీపు కుమార్ ఈ బిడ్డ రూపంలో త‌మ కుటుంబంలోకి మ‌ళ్లీ వ‌చ్చాడ‌ని గుడియా కుటుంబ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు.

దీపు కుమార్, గుడియాకు రెండేండ్ల క్రితం వివాహ‌మైంది. దీపు కుటుంబం ఆర్థిక ప‌రిస్థితి అత్యంత పేద‌రికంలో ఉంది. మ‌ట్టితో కూడిన ఇల్లు ఉంది. త్రాగ‌డానికి శుద్ధ‌మైన నీరు లేదు ఆ కుటుంబానికి. విద్యుత్ స‌ర‌ఫ‌రా కూడా లేదు ఆ ఇంటికి. దీపు కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.

Latest News