విధాత, వరంగల్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మాదన్నపేట గ్రామంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపుతుంది. వారం రోజుల క్రితం కనుకుంట్ల అక్షయ అనుమానాస్పదంగా మృతి చెందింది.
తన కూతురు చావుకి కారకుడు అనే ఉద్దేశంతో గుండపు రాజు(23) అనే యువకుడిని అక్షయ తండ్రి కనుకుంట్ల లెవేందర్ తెల్లవారుజామున కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేసి కడుపులో పొడిచి అతి కిరాతకంగా చంపినట్లు అనుమానిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు లేవేందర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.