విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధాలయం పాత గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర వారం రాత్రి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి దేవస్థానం తరపున అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
వధూవరులైన లక్ష్మీనరసింహులను పట్టు వస్త్రములు, రత్న ఖచిత సువర్ణాభరణాతో ముస్తాబు చేసి కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన యజ్ఞాచార్యులు, ప్రధానార్చకుల వేద పండిత బృందం ఆగమ శాస్త్రానుసారం కళ్యాణోత్సవాన్ని కనుల పండవగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శనివారం ఉదయం హవనం, గరుడ వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు రథంగాహోమం,శ్రీవారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.